ధర్మవరం డివిజన్ సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు, అల్లర్లు జరగకుండా చూడడమే మా లక్ష్యమని డిఎస్పీ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. డివిజన్లో 144 సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నందున, ఎక్కడ కూడా నలుగురు కంటే ఎక్కువ మంది గుముకూడరాదని అలా గుమిగూడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.