పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట లభించింది. సైఫర్ కేసులో ఆయన నిర్దోషిగా తేల్చుతూ ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో పాకిస్థాన్ విదేశాంగశాఖ మాజీ మంత్రి మహమూద్ ఖురేషీని కూడా నిర్దోషిగా ప్రకటించింది. ఇమ్రాన్ఖాన్ దగ్గర దౌత్య పరమైన రహస్యాలు ఏమీ లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది.