పొద్దు తిరుగుడు పంట సాగు చేసేటప్పుడు గింజ నాణ్యత తప్పనిసరిగా పాటిస్తేనే అధిక దిగుబడి పొందవచ్చు. పొద్దు తిరుగుడుకి పరాగసంపర్కం జరగడానికి తేనేటీగలు ఎంతగానో సహకరిస్తాయి.. కావున పుష్పించే సమయంలో హానికరమైన రసాయన పురుగు మందులను పిచికారి చేయకూడద. ఉదయం 7-10 గంటల సమయాల్లో సున్నితమైన మెత్తని వస్త్రంతో పువ్వు మీద రుద్దాలి. వారం రోజులకి ఒక్కసారి ఇలా చేయటం వల్ల ఫలదీకరణం సక్రమంగా జరిగి గింజ నాణ్యత పెరుగుతుంది.