నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

76చూసినవారు
ధర్మవరం పట్టణంలోని దుర్గమ్మ ఆలయంలో గురువారం నుండి దేవీ నవరాత్రుల పూజా కార్యక్రమం ప్రారంభించారు. ఈ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని వివిధ రకాల పూలు, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. దేవి నవరాత్రుల్లో మొదటి రోజైన గురువారం రోజు దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుండి ఆలయానికి తరలివస్తున్నారు.

సంబంధిత పోస్ట్