ధర్మవరం పట్టణంలో ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రస్థాయి బాలుర సీనియర్ విభాగం హాకీ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని అనంతపురం డిస్ట్రిక్ట్ హాకీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎస్. అనిల్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ మేరకు సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ. టోర్నమెంట్లో పాల్గొనాలనుకునేవారు ఈ నెల 15 లోపు సెలక్షన్ టీంను సంప్రదించాలని సూచించారు.