శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల నూతన ఎంపీడీవోగా విజయ భాస్కర్ నియామకమయ్యారు. గురువారం ఆయన తన కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎంపీడీవో కవిరాజు బదిలీపై మరో ప్రాంతానికి వెళ్ళారు. నూతన ఎంపీడీవో విజయ భాస్కర్ మాట్లాడుతూ. ప్రజలకు మెరుగైన సేవలు అందించటానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.