ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన లేపాక్షి దేవాలయంలో యాత్రికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేవాలయం మొత్తం బండ పై ఉండి ఎండ వేడిమికి యాత్రికులు దేవాలయ శిల్పసంపాదను తిలకించడానికి ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర పురావస్తు శాఖ వెంటనే దేవాలయం నడక మార్గంలో తివాచీ పరచి ఆలయ సంపదను వీక్షించడానికి చర్యలు తీసుకోవాలని యాత్రికులు కోరుతున్నారు.