ఎమ్మార్వోకు వినతిపత్రం

2465చూసినవారు
ఎమ్మార్వోకు వినతిపత్రం
అక్రమ చర్చి తొలగించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో తనకల్లు మండలం ఎమ్మార్వో కి సోమవారం వినతిపత్రం అందజేయడం జరిగింది. తనకల్లు మండలం విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీనాథ్ మాట్లాడుతూ తొట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో తావలం గ్రామ పరిధిలో ఉన్న స్థలంలో అక్రమంగా చర్చి నిర్మాణం చేపట్టారు అని తెలిపారు. ఆ చర్చి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవు. అక్రమ కట్టడం చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విశ్వహిందూ పరిషత్ తనకల్లు మండలం అధ్యక్షుడు శీతక శ్రీనాథ్ , గణేష్, భార్గవ్, విశ్వహిందూ పరిషత్ గౌర అధ్యక్షుడు నరేష్ , బాలాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ట్యాగ్స్ :