కదిరి ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది
శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో 1955 నుండి 2019 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు ఇండిపెండెంట్, భా.జ.పా ఒకసారి గెలుపొందాయి. కదిరి నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుండి మక్బూల్ అహ్మద్ (ముస్లిం), టీడీపీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, కాంగ్రెస్ నుండి కేఎస్ షానవాజ్ పోటీ పడుతున్నారు. గెలుపు కోసం ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.