వైసిపి కార్యకర్తలతో మాజీ ఎంపీ రంగయ్య సమావేశం

56చూసినవారు
వైసిపి కార్యకర్తలతో మాజీ ఎంపీ రంగయ్య సమావేశం
కళ్యాణదుర్గం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం మాజీ ఎంపీ తలారి రంగయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి తలారి రంగయ్య చర్చించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై అకారణంగా దాడులకు పాల్పడుతున్నారన్నారు. తాను, పార్టీ, వైఎస్ జగన్ అండగా ఉంటామని ఎవరూ అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్