కళ్యాణదుర్గం: విజేతలకు నగదు బహుమతి అందజేత

72చూసినవారు
కళ్యాణదుర్గం: విజేతలకు నగదు బహుమతి అందజేత
కళ్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లి గ్రామంలో యువత క్రీడల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేలా గ్రామంలో మల్లప్ప స్వామి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో తూర్పు కోడిపల్లి - ఉప్పవంక జట్లు తలపడగా ఉప్పవంక జట్టు విజేతగా నిలిచింది. అనంతరం విజేత జట్టుకు షీల్డ్, నగదు బహుమతిని టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ అందజేశారు.

సంబంధిత పోస్ట్