ట్రాన్స్ ఫార్మర్ల రాగి వైరు దొంగలను పట్టుకున్న పోలీసులు

72చూసినవారు
ట్రాన్స్ ఫార్మర్ల రాగి వైరు దొంగలను పట్టుకున్న పోలీసులు
కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ లో గురువారం సీఐ చంద్ర శేఖర్, కంబదూరు ఎస్ఐ అంజినేయులు విలేఖరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కావలి ఎర్రిస్వామి, చాకలి రాఘవేంద్ర ముద్దాయిలు రైతు పొలాల్లోని ట్రాన్స్ ఫార్మర్ల రాగి వైరు దొంగలించడంతో డి. ఎస్. పి ఆదేశాల మేరకు వారిని అరెస్టు చేశామన్నారు. కళ్యాణదుర్గం రూరల్ పోలిస్ స్టేషన్ పరిధిలో 10ట్రాన్స్ ఫార్మర్ల రాగి వైరు చోరీ చేసినవారిని అరెస్టు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్