గోరంట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

74చూసినవారు
గోరంట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
ఇళ్ల స్థలాల అర్జీలకు పరిష్కారం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోరంట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఇల్లు లేని పేదలు సుమారు 300 మంది గత ఆరు నెలల క్రితం ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వీటిని పరిష్కారం చేయాలని బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్