శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఈద్గా లో ముస్లిం మైనార్టీ సోదరులు ఈదుల్-ఫితర్ ప్రత్యేక నమాజ్ చేసి( దువా) ప్రార్ధనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకరికొకరు రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.