భక్తి శ్రద్ధలతో ఘనంగా ఆలయ గోపురానికి కుంబాభిషేకం

61చూసినవారు
రాయదుర్గం నేసే పేటలో వెలసిన వరలక్ష్మి శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో గోపురానికి కుంభాభిషేకం మంగళవారం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా కుంభాభిషేకం నిర్వహించారు. వందలాది మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనెల 13న వరలక్ష్మి దేవి సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్