గుమ్మగట్ట మండలంలోని గోనబావి, పులకుంట గ్రామాల నుంచి వడ్డెర్లు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గురువారం రాయదుర్గంలోని సీతారామాంజనేయ కల్యాణ మండపంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్డెర్ల ఆత్మీయ సదస్సులో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. జై జగన్ అంటూ నినదించారు. మెట్టుకు మద్దతుగా తామంతా నిలుస్తామని వడ్డెర్ల సంఘం నేతలు ప్రకటించారు.