సింగనమలలో పోటాపోటీగా ఎన్నికల ‘కురుక్షేత్రం'
అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలో 1967 నుండి 2019 వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. 7 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ, వైసీపీ, జనతా పార్టీ, స్వతంత్ర పార్టీ ఒక్కోసారి గెలుపొందాయి. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందగా,ఈ సారి వైసీపీ టికెట్ మన్నెపాకుల వీరాంజనేయులుకు దక్కింది. కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున బండారు శ్రావణి శ్రీ, కాంగ్రెస్ నుండి సాకే శైలజానాథ్ పోటీ చేస్తున్నారు. గెలుపు కోసం ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.