పన్ను చెల్లించకపోవడంతో సినిమా థియేటర్ కు తాళాలు వేసిన అధికారులు

3993చూసినవారు
పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో సినిమా థియేటర్ కు అధికారులు తాళాలు వేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. తాడిపత్రిలోని దాదా థియేటర్ ప్రస్తుతం ఎస్వీ థియేటర్ గా నడుస్తోంది. అయితే 2018 నుంచి ఇప్పటివరకు పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో మున్సిపల్ ఆర్ ఓ రాజేశ్వరిబాయి థియేటర్ వద్దకు చేరుకుని తాళాలు వేశారు. దాదాపు రూ. 12 లక్షల వరకు పన్ను చెల్లించలేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్