విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలి

72చూసినవారు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలి
పెద్దవడుగూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఎంఈఓ రాముడు, ఎంఈ ఓ-2 గురుప్రసాద్ లు ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. బుధవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా కొత్తగా విధుల్లో చేరిన మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. బీసీ కాలనీ, చేనేత కాలనీ వద్ద ఉన్న పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

సంబంధిత పోస్ట్