స్వచ్ఛందంగా అంతిమ సంస్కారం

55చూసినవారు
స్వచ్ఛందంగా అంతిమ సంస్కారం
యాడికి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందడంతో ఆయన అంత్యక్రియలను స్థానిక మేఐహెల్ప్ యూ స్వచ్ఛంద సంస్థ సభ్యులు గురువారం పూర్తి చేశారు. స్థానిక రామస్వామి గుడి వీధిలో ఉంటున్న కందికుంట కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడికి ఒక కుమారుడు మినహా ఇతర కుటుంబ సభ్యులు లేకపోవడంతో స్థాని కులు సంస్థ సభ్యులకు సమాచారం అందించారు. సంస్థ అధ్యక్షుడు బాల కృష్ణ ఆధ్వర్యంలో మృతుడికి అంత్యక్రియలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు

సంబంధిత పోస్ట్