అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాలలో నేడు కేంద్ర కరువు బృందం (ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం) పర్యఠించనుంది. రబీ 2023-24 సంవత్సరానికి సంబంధించి కరువు ప్రభావం, పంట నష్టం, పశుగ్రాస కొరత తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై వారు క్షేత్రస్థాయి పరిశీలించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.