టీడీపీకి మద్దతుగా ముస్లిం మహిళల ర్యాలీ

574చూసినవారు
టీడీపీకి మద్దతుగా ముస్లిం మహిళల ర్యాలీ
టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని ముస్లిం మైనారిటీ నాయకులు పేర్కొన్నారు. పార్టీకి మద్దతుగా మంగళవారం ఉరవకొండలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఐక్యత చాటుతూ తామంతా తెదేపా వెంటే నడుస్తున్నామన్న సంకేతాన్ని అందించారు. ర్యాలీలో తెదేపా యువ నాయకుడు విజయసింహ పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో కిట్టు, ఖాదర్ బాషా, అల్లాబకాశ్, జెండా సలీమ్, యూనుస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్