ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారం కూడా చేసారు. తాజాగా కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. 24మందికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్లకు కీలక శాఖల బాధ్యతల్ని అప్పగించారు. కాగా ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల కేశవ్ కు ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాల శాఖను కేటాయించారు.