బద్వేలు: విద్యార్థిని మృతి చెందిన సంఘటన విషాదకరం

56చూసినవారు
విద్యార్థిని మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తపరుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి అన్నారు. ఆదివారం రాత్రి బద్వేలలో ఆమె మాట్లాడుతూ. అఘాయిత్యానికి గురైన ఇంటర్ విద్యార్థిని రిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంఘటన విషాదకరం, సమాజంలో మానవ మృగాలను కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది, తీర్పులు త్వరితగతిన వెలువడే విధంగా న్యాయస్థానాలు పనిచేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు.

సంబంధిత పోస్ట్