మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకే: ఎస్సై

64చూసినవారు
మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకే: ఎస్సై
మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని ఎస్సై సి. వెంకటసుబ్బయ్య హెచ్చరించారు. మంగళవారం రాత్రి రామసముద్రం ములభాగల్ రోడ్డు, చెంబకూరు రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్