మినుము వంట యాజమాన్య సాగు పద్దతుల పై రైతులకు అవగాహన

84చూసినవారు
మినుము వంట యాజమాన్య సాగు పద్దతుల పై రైతులకు అవగాహన
మైదుకూరు మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రం వనిపెంట నందు కోరమాండల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారితో కలిసి సంయుక్తంగా మినుము వంట యాజమాన్య సాగు పద్దతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కేవీకే అధిపతి డాక్టర్ యం. బాలకృష్ణ మినుము సాగు గురించి వివరించారు. విత్తన శుద్ది పొలం తయారీ, పోషక యాజమాన్యము, చీడపీడల నిర్మూలన పద్దతుల గురించి విశ్లేషించారు. రైతు సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్