ముగ్గురిపై కేసు నమోదు చేసిన ఫారెస్ట్ అధికారులు

79చూసినవారు
ముగ్గురిపై కేసు నమోదు చేసిన ఫారెస్ట్ అధికారులు
వేంపల్లె మండలంలోని దిగువ తువ్వపల్లెలో బుధవారం అడవి పంది మాంసం వండాలని చూస్తున్న ముగ్గురిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ. దిగువ తువ్వపల్లె గ్రామంలో అడవి పంది మాంసం వండుకుని తినేందుకు సిద్ధంగా ఉండగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వన్యప్రాణులకు సంరక్షణకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేదే లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్