పులివెందులలో మొక్కలు నాటిన ఎమ్మెల్సీ

85చూసినవారు
పులివెందుల పట్టణంలోని నల్లపురెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, టీడీపీ నాయకులు నంద్యాల జయరామిరెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్