ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

63చూసినవారు
ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
రైల్వే కోడూరు మండలం ఉర్లగట్టుపోడు, వైఎస్ఆర్ కాలనీలో మంగళవారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులను గురించి, సమస్యలు గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్. అనంతరం మొక్కలు నాటి, గ్రామ సమస్యలు గురించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు శాఖ అధికారులు, ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్