వరద బాధితుల కోసం విరాళాల సేకరణ

63చూసినవారు
వరద బాధితుల కోసం విరాళాల సేకరణ
విజయవాడ వరద బాధితులకోసం లక్కిరెడ్డిపల్లి పట్టణంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో.. పలువురు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద వలంటీర్లతో కలసి ఆదివారం విరాళాలు సేకరించే కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ప్రధాన వీధులలో తిరుగుతూ ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాకు జమచేయనున్నట్లు తెలిపారు. వేమిరెడ్డి సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, విశ్వనాథ్,ప్రసాద్,శ్రీనివాసులు, శంకరయ్య, పక్కీరయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్