తంబళ్ళపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

79చూసినవారు
తంబళ్ళపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
తంబళ్లపల్లి మండలం మంకువారి పల్లెకు బీహార్ నుండి పది మంది వచ్చి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సరుకులు తీసుకొని రావడానికి గుర్రంకొండకు ఫిరోజ్ అన్సారి (40) బైకుపై వెళుతుండగా కుమ్మరపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొన్నదని తంబళ్లపల్లి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ లోకేష్ తెలిపారు. గాయపడిన అన్సారీని మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్