నూతన సీఐ, ఎస్ఐకు సన్మానం

78చూసినవారు
ములకలచెరువు సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజా రమేష్, ఎస్ఐ గాయత్రిని జనసైనికులు బుధవారం వారి కార్యాలయాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తంబళ్లపల్లె ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో సీఐ రాజా రమేష్, ఎస్ఐ గాయత్రిని వేర్వేరుగా శాలువాతో సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేయాలని కోరారు. పవన్ రెడ్డి, శ్రీనివాసులు, హరి, జనసైనికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్