డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తోన్న మున్సిపల్ కార్మికుల సంఘాలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీ వారితో చర్చలు జరపనుంది. కాగా, నేటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెను తీవ్రతరం చేశారు. మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తున్నారు. రేపు ఎక్కడికక్కడ మానవహారాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.