సంక్రాంతి ప్రయాణికులకు APSRTC శుభ‌వార్త‌

129926చూసినవారు
సంక్రాంతి ప్రయాణికులకు APSRTC శుభ‌వార్త‌
సంక్రాంతి పండుగ‌కు సొంతూళ్లకు వచ్చి వెళ్లే ప్రయాణికులకు APSRTC శుభ‌వార్త చెప్పింది. పండుగ సంద‌ర్భంగా రెగ్యులర్‌ సర్వీసులతోపాటు అదనంగా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్ర‌క‌టించింది. వీటిలో సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్లు వెల్ల‌డించింది. ఒకేసారి రానూపోనూ రిజర్వేషన్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్న‌ట్లు తెలిపింది. నేటి నుంచి ఈ నెల 14 వరకు 3,570 బస్సులు, 16 నుంచి 18 వరకు 3,225 బస్సులను న‌డ‌ప‌నుంది.

సంబంధిత పోస్ట్