టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం

73177చూసినవారు
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, వైసీపీ నేత ఉమా మహేశ్వర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఇరుపార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణలో టీడీపీకి చెందిన పలువురు నేతలు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రచారం దారి విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ మేరకు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్