ఆటో బోల్తా.. 17 మంది గాయాలు

82చూసినవారు
ఆటో బోల్తా.. 17 మంది గాయాలు
పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సీతంపేట మండలం వంగరిల్లి ఘాటూరోడ్డు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్