పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సీతంపేట మండలం వంగరిల్లి ఘాటూరోడ్డు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.