త్వరలోనే స్వచ్చ గుంటూరు కల సాకారం అవుతుంది: కమిషనర్

73చూసినవారు
స్వచ్చ గుంటూరు సాధనలో ప్రజలు, యువత, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. సమిష్టి కృషితో స్వచ్చ గుంటూరు అతి త్వరలో సాకారమవుతుందని తెలిపారు. మంగళవారం టిజెపిఎస్ కళాశాల ఆడిటోరియంలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు వ్యర్ధాల నిర్వహణపై అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం చేపట్టిన స్వచ్ఛత హి సేవా మానవహారంలో కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్