ఈనెల 29న పిల్లల కథల పోటీలు: ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు

78చూసినవారు
స్మార్ట్ ఫోన్లు వాడుతున్న కారణంగా పిల్లల్లో ఆలోచనా శక్తి తగ్గిపోతోందని ఎమ్మెల్సీ కె. ఎస్ లక్ష్మణ్ రావు తెలిపారు. పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంచేందుకు జన విజ్ఞానం వేదిక కృషి చేస్తుందని చెప్పారు. గుంటూరులో ఈనెల 29వ తేదీన పిల్లల కథల పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ పోటీలకు హాజరు కావాలన్నారు. పోటీలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్