అక్రమంగా నిర్బంధించి, లాఠీలతో కొట్టారు: మాజీ ఎమ్మెల్యే కాసు

84చూసినవారు
వైసీపీ నేతల మీద అక్రమ కేసులు బనాయిస్తూ, బాధితులను పోలీసులు హింసిస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు శుక్రవారం అన్నారు. బ్రాహ్మణపల్లిలో సర్పంచ్ ఆరోగ్యం బాగాకపోతే పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ సోషల్ మీడియా గురజాల కన్వీనర్ వెన్నా రాజశేఖర్ రెడ్డిపై టీడీపీ అల్లరి మూక దాడి చేయబోయారని అన్నారు. కాపాడాల్సిన సీఐ భాస్కరరావు అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి లాఠీలతో కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్