దాచేపల్లిలో: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు

54చూసినవారు
దాచేపల్లిలో శనివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. దాచేపల్లి మాచర్ల క్రాస్ రోడ్ వద్ద ఎక్సెల్ లారీ ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. అలాగే ఇరికేపల్లి నాగిరెడ్డి స్థూపం వద్ద బైకు రోడ్డు క్రాస్ చేస్తున్న మరో బైక్ ఢీ కొనడంతో రామాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్