మాచర్లలో అక్రమ మద్యం పట్టివేత

56చూసినవారు
అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు మాచర్ల సెబ్ సీఐ కిషోర్ తెలిపారు. మంగళవారం సీఐ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దుర్గి మండలం తేరాల గ్రామానికి చెందిన రామ మోహన్ రావు తన గృహంలో నిల్వ చేసిన 236 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారన్నారు.

సంబంధిత పోస్ట్