కేటీఆర్‌పై మరోసారి మంత్రి కొండా సురేఖ ఆగ్రహం

74చూసినవారు
కేటీఆర్‌పై మరోసారి మంత్రి కొండా సురేఖ ఆగ్రహం
మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఫైరయ్యారు. సోషల్‌ మీడియాను అడ్డం పెట్టుకొని తమపై పిచ్చి రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్‌ పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్. బడ్జెట్‌ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదు. ఫామ్‌హౌస్‌లో ఏం చేస్తున్నారో తెలియదు. గజ్వేల్‌లో కేసీఆర్‌ కనిపించడంలేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్