గణేష్ మండపాలు సందర్శించిన మంత్రి లోకేశ్

84చూసినవారు
గణేష్ మండపాలు సందర్శించిన మంత్రి లోకేశ్
మంగళగిరి నగరంలోని గణేష్ మండపాలను మంత్రి నారా లోకేశ్ శుక్రవారం సందర్శించారు. తొలుత మంగళగిరి మెయిన్ బజార్ లో సంకాబాలాజీ గుప్తా అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద రూ. 2.30 కోట్ల నగదుతో చేసిన గణపతి అలంకారాన్ని ఆయన దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నగరంలోని పలు మండపాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్