మంగళగిరి మండలం కాజా శివారు పొలాల్లో ఉన్న లహరి వెంచర్ లో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ మాట్లాడుతూ రైతుల సమాచారంతో ట్రైనీ డిఎస్పీ భార్గవి తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేయగా మృతుడు పడమట శ్రీనివాసరావు (36) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.