మెడికల్ కాలేజీలు తీసుకొస్తే నష్టం ఏంటి..?: మాజీ ఎమ్మెల్యే

64చూసినవారు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి సీట్లు ఇస్తే కూటమి ప్రభుత్వానికి నష్టం ఏంటని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నరసరావుపేటలో విలేకరులతో మాట్లాడారు. కూటమి హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒకటి కూడా రాకపోవడం శోచనీయమని అన్నారు. ప్రస్తుతం ఉన్న హెల్త్ మినిస్టర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు లేరు అంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్