ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతోనే అపార నష్టాన్ని అరికట్టగలిగామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లె నియోజకవర్గంలో వరద ముంపునకు గురైన చాట్రగడ్డ, రుద్రవరం గ్రామాలను సహచర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి బుధవారం పరిశీలించారు. వరద వచ్చిన వెంటనే ఎక్కడికక్కడే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా కాపాడగలిగామని తెలిపారు.