![రాజుపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ రాజుపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ](/static/media/lokal_featured_large.fba17ce5.png)
రాజుపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
రాజుపాలెం మండలంలోని గణపవరం గ్రామంలో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.