సీఎం చంద్రబాబు, బీజేపీ నేతలు ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని ఏపీసీసీ చీఫ్ YS షర్మిలా రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు.. కానీ ప్రత్యేక హోదా అందించడంలో విఫలమయ్యారన్నారు. ఇప్పుడు, బీజేపీ మద్దతుతో పోలవరం ప్రాజెక్ట్ను పూర్తిచేస్తానని చెప్పడం.. చంద్రబాబు, బీజేపీ ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.