మధ్యం ధరలపై చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు. లోకల్ బ్రాండ్స్తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో లక్ష మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. కుప్పంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం వేదికగా ఆయన ఈ మేరకు మాట్లాడారు.