పారిశుధ్య నిర్వహణలో మార్పు కనిపించాలి: కమిషనర్

85చూసినవారు
పారిశుధ్య నిర్వహణలో మార్పు కనిపించాలి: కమిషనర్
చిత్తూరు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ప్రత్యేక మార్పు కనిపించాలని, కంటికి కనిపించేలా పారిశుధ్యం మెరుగుపరచాలని కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం నగరపాలక కార్యాలయంలో ప్రజారోగ్య విభాగం అధికారులు, వార్డు కార్యదర్శులు, మేస్త్రీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడా అపరిశుభ్ర పరిసరాలు కనిపించరాదని, ప్రధానంగా డంపర్ బిన్లు సకాలంలో క్లియర్ చేసి శుభ్రంగా ఉంచాలన్నారు.

సంబంధిత పోస్ట్